ఆటో బోల్తా.. 11 మందికి గాయాలు
రాయికల్(కరీంనగర్): వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కూరగాయాలు తీసుకురావడానికి ఆటోలో వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. దీంతో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం మోరపెల్లి వద్ద శనివారం ఉదయం జరిగింది. రాయికల్ మండల కేంద్రంలో కూరగాయాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న 14 మంది వ్యాపారస్థులు కలిసి కూరగాయలు తేవడం కోసం ఆటోలో జగిత్యాలకు బయలుదేరారు.
ఈ క్రమంలో ఆటో మోరపెల్లి శివారులోకి చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇది గమనించి స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. కాగా.. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.