ఆటో బోల్తా.. 11 మందికి గాయాలు


రాయికల్(కరీంనగర్): వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కూరగాయాలు తీసుకురావడానికి ఆటోలో వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. దీంతో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం మోరపెల్లి వద్ద శనివారం ఉదయం జరిగింది. రాయికల్ మండల కేంద్రంలో కూరగాయాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న 14 మంది వ్యాపారస్థులు కలిసి కూరగాయలు తేవడం కోసం ఆటోలో జగిత్యాలకు బయలుదేరారు.



ఈ క్రమంలో ఆటో మోరపెల్లి శివారులోకి చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇది గమనించి స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. కాగా.. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top