చదువుల ఒత్తిడి: విద్యార్థిని ఆత్మహత్య
వైరా (ఖమ్మం జిల్లా) : చదువుల ఒత్తిడి మరో విద్యార్థినిని బలిగొంది. కొల్లిజర్ల మండలం పెద్దలోపటి గ్రామానికి చెందిన యామాల మేఘన(15) అనే పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. చదువు ఒత్తిడికి తట్టుకోలేక సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విద్యార్థిని వైరా మండల కేంద్రంలోని ఎస్డబ్ల్యుఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. కుమార్తె ఆకస్మిక మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.