లాడ్జిలపై పోలీసుల దాడి


భువనగిరి అర్బన్ (నల్లగొండ) : నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలోని వడాయిగూడెం గ్రామంలో ఉన్న 3 లాడ్జిలపై పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లాడ్జిలలో ఉన్న 10 జంటలను పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో పట్టబడిన వారిని రూరల్ స్టేషన్‌కు తరలించారు. కాగా.. న్యూసెన్స్ ఎక్కువవుతోందనే ఫిర్యాదుతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారని తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top