కారు బోల్తా: బాలుడి మృతి
కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద శనివారం మధ్యాహ్నం ఓ కారు బోల్తా పడడంతో ఏడాది వయసున్న బాబు ప్రాణాలు కోల్పోయాడు. ఎస్కే శ్రీను బాషా హైదరాబాద్లో ఓ సెల్ఫోన్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. తన తమ్ముడి నిశ్చితార్థం కోసం అతడు కుటుంబ సభ్యులతో కలసి కారులో విజయవాడకు బయల్దేరాడు.
కేతేపల్లి మండలం ఇనుపాముల వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో శ్రీనుబాషా చిన్న కుమారుడు నీరా లోహితాజ్ (1) అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య, మరో కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం నకరికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.