ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: ఒకరి మృతి
వలిగొండ: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా వలిగొండలో మంగళవారం చోటుచేసుకుంది. చిట్యాల నుంచి భువనగిరి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న సాయిలు(40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచరం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.