బైక్ ను ఢీకొన్నబస్సు : ఒకరి మృతి
శంషాబాద్ : వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామ సమీపంలో బెంగళూరు జాతీయరహాదారిపై జరిగింది. వివరాలు..మండలంలోని కిషన్గూడకు చెందిన సిద్ధూ(25) ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. శనివారం బైక్పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది చూసి ఆగ్రహించిన స్థానికులు బస్సు అద్ధాలు పగలకొట్టి జాతీయరహదారిపై ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.