రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి


ఆదిలాబాద్: నాగ్‌పూర్- హైదరాబాద్ జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన కస్తూరి రాములు(35) బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రాములు అక్కడికక్కడే చనిపోయాడు. ఇచ్చోడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బోథ్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top