ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి


చేవెళ్ల: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆర్టీసి బస్సు ఢీకొనడంతో అతను అక్కడి కక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ బస్టాండ్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. రేగడి ఘన్‌పూర్ గ్రామానికి చెందిన జి. బుచ్చిరెడ్డి(55) అనే రైతు రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top