బైక్పై నుంచి పడి ఒకరి మృతి
గోదావరిఖని: కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని మాల్యాలపల్లి సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం రాత్రి బైక్పై నుంచి పడి బానోత్ తిరుపతి(18) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. కేలితు కల్యాణ్, అజ్మీరా రాజు అనే మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.