స్వైన్ఫ్లూతో ఒకరు మృతి
దుగ్గొండి: వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలంలో స్వైన్ఫ్లూన్తో ఒకరు మృతి చెందారు. నాచినపల్లి గ్రామానికి చెందిన సిరిపురం భవాని(23) అనే మహిళ స్వైన్ఫ్లూతో బాధపడుతోంది. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. ఇప్పటివరకు స్వైన్ఫ్లూ మృతుల సంఖ్య 31 కు చేరింది. ప్రస్తుతం రెండు పాజిటివ్ కేసులు, 5 అనుమానాస్పద కేసులు నమోదైనట్టు వైద్యులు తెలిపారు.