ప్రసాదం వికటించి ఒకరి మృతి
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ఓ దేవాలయంలో పంపిణీ చేసిన ప్రసాదం వికటించి ఓ మహిళ మృతిచెందింది. అస్వస్థతకు గురైన మరో 11 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురి పరిస్థతి విషమంగా ఉంది. వివరాలు...అదిలాబాద్ జిల్లా జైనత్ మండలం గిమ్మా గ్రామంలో మంగళవారం స్తానిక అంజనేయస్వామి దేవాలయంలో ప్రసాదం పంచి పెట్టారు.
కాగా ప్రసాదం తిని 12 మంది అస్వస్థతకు గురైయ్యారు. వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మి అనే మహళ బుధవారం ఉదయం మృతిచెందగా, లక్ష్మి కూతురు శివాని(3), పరిస్థతి విషమంగా ఉంది. మరో ఇద్దరు కోల ఆకాశ్(10), కోల అఖిల(12)ల పరిస్థితి విషమంగా ఉంది.