నేడు వైఎస్‌ఆర్ వర్ధంతి

నేడు వైఎస్‌ఆర్ వర్ధంతి - Sakshi


బెంగళూరు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదవ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం బెంగళూరులో పలు సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు కర్ణాటక డాక్టర్ వైఎస్‌ఆర్ స్మారక ఫౌండేషన్ తెలిపింది.



ఉదయం 9 నుంచి 11 గంటల వరకు వయ్యాలి కావెల్‌లోని తెలుగు విజ్ఞాన సమితి ప్రాంగణంలో వర్ధంతి సభ ఉంటుందని ఫౌండేషన్ అధ్యక్షుడు భక్తవత్సల రెడ్డి తెలిపారు. అనంతరం యలహంకలోని తెలుగు పాఠశాలకు ఐదు కంప్యూటర్లను ఉచితంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్ అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top