పంటలు పరిశీలించిన వైఎస్సార్సీపీ నేత నాడెం
వరంగల్ జిల్లా: ఏటూరునాగారం మండలంలోని పలు గ్రామాల్లో వైరస్లతో నాశనమైన పంటలను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ పరిశీలించారు. పంట పూర్తిగా నష్టపోయిన, దిగుబడి తగ్గిన వరి, మిర్చి రైతులను ఆయన కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట యువజన విభాగం అధ్యక్షుడు అప్సం, కిషన్, ఏటూరునాగారం మండల శాఖ అధ్యక్షుడు ఎం.డి.కైసర్పాషా, కార్యకర్తలు ఉన్నారు.