వెంకన్న సేవలో ప్రముఖులు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. డీఐజీ ప్రభాకర్, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు, కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్కుమార్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ ఆరంభ సమయంలో వారు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.