బుద్దాలవారి పాలెం చేరుకున్న వైఎస్ జగన్

బుద్దాలవారి పాలెం చేరుకున్న వైఎస్ జగన్ - Sakshi

మచిలీపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మచిలీపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో భూములు కోల్పోయిన నిర్వాసితులతో సమావేశమయ్యేందుకు ఆయన బుద్దాలవారి పాలెం చేరుకున్నారు. అక్కడ బాధితులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి కోన గ్రామానికి చేరుకుని బాధిత రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. కాగా అంతకముందు గన్నవరం ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్ కు  ఘనస్వాగతం లభించింది. పార్టీ అగ్రశేణి నాయకులు గౌతంరెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు జగన్‌కు స్వాగతం పలికారు.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top