ఎన్నారైల ఉత్సాహం.. అపూర్వం

ఎన్నారైల ఉత్సాహం.. అపూర్వం - Sakshi


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ప్రవాస భారతీయులు చూపించిన ఉత్సాహం అపూర్వమని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు. ''ఎన్నారై సోదరులు, సోదరీమణులు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చూపిస్తున్న ఉత్సాహం.. హోదాపై పోరులో నా విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. మీలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు'' అని ఆయన తన ట్వీట్‌లో (@ysjagan) పేర్కొన్నారు.



ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా చెప్పినా, దాన్ని స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడాన్ని పలువురు ఎన్నారైలతో పాటు విద్యార్థులు కూడా తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ఈ అంశంపై వైఎస్ జగన్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రవాస భారతీయులు పలు దేశాల నుంచి ఉత్సాహంగా పాల్గొన్నారు.


 

 

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top