కుమార్తెకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలోని ఊట్కూరు మండలం బాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శశికళ(28) విషం తాగింది. తాను తాగడమేకాక కుమార్తె శ్రావణి(10)కి కూడా తాగించింది. అయితే కడుపులో మంటతో కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తల్లి మృతిచెందగా కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు.