వివాహిత ఆత్మహత్య
మేడిపల్లి: వివాహిత కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని మృతి చెందింన సంఘటన కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం పసునూర్ గ్రామంలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కొప్పుల రాజేశం, లత దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన లత ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించడానికి యత్నిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.