మద్యం మత్తులో మహిళ వీరంగం

మద్యం మత్తులో మహిళ వీరంగం - Sakshi


చెన్నై(అన్నానగర్‌):

లాల్‌కుడిలో మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ వీరంగం సృష్టించింది. లాల్‌కుడిలోని ఓ మద్యం షాపులో శుక్రవారం పూటుగా మద్య సేవించిన ఓ 35 సంవత్సరాల మహిళ పక్కనే రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమెకు సహాయం చేసేందుకు కొంతమంది అక్కడకు చేరారు. అయితే వారిని అసభ్యపదజాలంతో దూషిస్తూ ఆ మహిళ వీరంగం చేసింది.



 దీనిపై సమాచారంతో అక్కడికి వచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు సదరు మహిళను ఆటోలో ఎక్కించేందుకు ప్రయత్నించారు. అయితే ఒకవైపు నుంచి ఎక్కిస్తే మరోవైపు నుంచి బయటకు వస్తూ వారిని కూడా ఆ మహిళ నానా తిప్పలు పెట్టింది. చేసేదిలేక వారు కూడా అక్కడి నుంచి కొద్దిసేపటికే వెనుదిరిగారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top