పక్కింటి మహిళ తిట్టిందని..
మైసూరు: పక్కింటి మహిళ అనుమానపు వేధింపలు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన శనివారం నగరంలోని ఎన్.ఆర్.మొహల్లా కరిమండిలో చోటు చేసుకుంది.
ఎన్.ఆర్.మొహల్లా కరిమండి ప్రాంతంలో స్వాతి(28),లక్ష్మీలు చాలా కాలంగా పక్కపక్క ఇళ్లల్లో నివసిస్తున్నారు. అయితే తన భర్త శివణ్ణ స్వాతితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడనే అనుమానంతో లక్ష్మీ తరచూ గొడవపడుతుండేది. శనివారం కూడా ఇదే విషయమై లక్ష్మీ గొడవ పడింది. మనస్థాపం చెందిన స్వాతి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్వాతి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు ఎన్.ఆర్.మొహల్లా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.