హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్
కేకేనగర్: కూలీ హత్య కేసులో అతని భార్య, ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవిల్లిపుత్తూర్ సమీపంలో గల మంసాపురంకు చెందిన ఈశ్వరన్ (45) భార్య రాజేశ్వరి (36). వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈశ్వరన్ కూలీ. రాజేశ్వరి కూరగాయల దుకాణం నడుపుతోంది.
శ్రీవిల్లిపుత్తూర్ కోటై్టపట్టికి చెందిన పొన్రాజ్ (32) తో రాజేశ్వరికి వివాహేతర సంబంధం ఏర్పడింది. పొన్రాజ్కు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో వీరి విషయం తెలుసుకుని ఈశ్వరన్ అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన రాజేశ్వరి ప్రియుడు పొన్రాజ్తో కలిసి ఈశ్వరన్ను హత్య చేయడానికి పథకం పన్నింది. దానిప్రకారం ఈశ్వరన్ కూలి పని చేసే ప్రాంతంలో మద్యం మత్తులో పడుకుని ఉండగా రాజేశ్వరి, పొన్రాజ్ వేటకత్తితో నరికి హత్య చేశారు. దీనిపై శ్రీవిల్లిపుత్తూర్ టౌన్ సీఐ మహేష్ కుమార్ కేసు దర్యాప్తు చేపట్టారు. విచారణలో రాజేశ్వరి, పొన్రాజ్ కలిసి ఈశ్వరన్ను హత్య చేశారని తెలిసింది. దీంతో ఇరువురిని అరెస్టు చేసి శ్రీవిల్లిపుత్తూర్ కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి పరమశివం ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.