భోగాపురంలో అప్రకటిత కర్ఫ్యూ

(ఫైల్‌ ఫొటో)

భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో బుధవారం అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఎయిర్‌పోర్టు నిర్మాణంపై బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా గ్రామాల ప్రజలకు, సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు కూడా రెవెన్యూ సిబ్బంది ఆహ్వానం పంపారు. తీరా ప్రజాభిప్రాయ సేకరణ సమయానికి వచ్చేసరికి సీన్‌ రివర్స్‌ అయింది. ప్రశ్నలు సంధిస్తారని అనుమానం వచ్చిన వారిని హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను బయటికి రాకుండా నిర్బంధిస్తున్నారు. కేవలం టీడీపీ అనుకూలమైన నాయకులను మాత్రం ప్రజాభిప్రాయసేకరణ సమావేశానికి అనుమతిస్తున్నారు. దీనిపై ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top