అమిత్షాతో ఉద్ధవ్ రహస్య చర్చలు?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి చిట్టచివరి నిమిషంలో వచ్చిన శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే.. ఆ తర్వాత ఏం చేశారు? ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఆయన వెళ్లి.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షాతో రహస్య మంతనాలు జరిపారు. వాస్తవానికి చిట్టచివరి నిమిషంలో అమిత్షా పిలవడంతోనే ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారానికి హాజరైన విషయం తెలిసిందే.
అంతకుముందు వరకు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని చెప్పిన ఠాక్రే.. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. బీజేపీ తమను అవమానించిందని చెప్పినా.. ఎట్టకేలకు మళ్లీ వచ్చారు. వచ్చిన తర్వాత ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అమిత్షాను కలిశారు. దీంతో మళ్లీ పాత మిత్రులు కలుస్తారనే కథనాలు వెలువడుతున్నాయి.