భవనంపై నుంచి పడిన చిన్నారి


వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములావాడ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. రెండతస్థుల భవనం పై ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు  కిందపడింది. భవనం పై నుంచి ఇంటి ముందు ఉన్న గేటుపై పడటంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిన్నారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటన పట్టణంలోని అర్బన్‌ కాలనీలో గురువారం చోటు చేసుకుంది.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top