సెల్ఫీ సరదాతో ఇద్దరు మృతి


ఘట్‌కేసర్‌: మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలంలోని అన్నోజిగూడలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ సరదాతో  ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తార్నాకలోని నారాయణ జూనియర్‌ కాలేజ్‌కు చెందిన అవినాష్‌(16), పీడీఎస్‌ చరణ్‌(16)లు స్థానికంగా ఉండే ఓ నీటి గుంత వద్ద సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అదుపుతప్పి ప్రమాదవశాత్తూ నీటిగుంతలో పడిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top