ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య
మహారాష్ట్ర: తమ సమాచారం గురించి పోలీసులకు ఉప్పందిస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు కిరాతకంగా హతమార్చారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి సమీప అటవీ ప్రాంతంలో ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఇది గుర్తించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.