ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య..


ముంబై: పన్వేల్‌ తాలూకాలోని కామోటే ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. సెక్టార్‌–36లోని ఇంద్ర విహార్‌ భవనంలో నివాసముంటున్న ఓ కటుంబంలోని భర్త, భార్య, 17 ఏళ్ల కూతురు ఉరేసుకుని తనువు చాలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎం.జి.ఎం. ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది.

 

 

 

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top