ఆ రెండు చోట్ల పిడుగు పడే అవకాశం


అమరావతి: కాసేపట్లో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకు 3 కి.మీల పరిధిలో పిడుగు పడే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. అలాగే, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలం భూపతిపల్లి గ్రామానికి 3 కి.మీ పరిధిలోనూ పిడుగు పడే అవకాశముందని తెలిపింది. మార్కాపురం, నర్సీపట్నంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top