విద్యార్థినిపై ఉపాధ్యాయుల అఘాయిత్యం
గంట మోగగానే అందరూ తర్వాత సబ్జెక్ట్ పుస్తకాలు సిద్ధం చేసుకుంటుండగా, తాను మాత్రం ఆ సంకటం నుంచి ఎలా బైటపడాలా అని మథనపడుతూ ఉంటుంది. ఎందుకంటే పాఠాలు చెప్పడానికొచ్చే ఆ టీచర్లు తననే చూస్తారు. అదోలా మాట్లాడతారు. క్లాస్ లో ఎవ్వరూ లేనప్పుడు, అప్పుడప్పుడూ స్టాప్ రూమ్ లోకి తీసుకెళ్లి ఏదేదో చేస్తారు. తాము చేసింది బయటికి చెబితే చంపేస్తామంటారు.
అలా ఏడాది గడిచింది. తాను అనుభవిస్తున్నది ఘోర అకృత్యమని కూడా అర్థం చేసుకోలేనంతగా ఎదగలేదామె. నాలుగో తరగతి చదువుకు, 9 ఏళ్ల వయసుకు... భారీ ఆకారాలున్న టీచర్లు జరిపే లైంగికదాడిని ఎదిరించే శక్తి ఎక్కడినుంచి వస్తుంది? అందుకే బాధను అనుభవించింది. క్రమంగా విరక్తిలోకి ప్రవేశించింది. అప్పుడుగానీ ఆమె తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు.. తమ బిడ్డను ఎవరో హింసిస్తున్నారని. చివరికి ఒక రోజు ఆ చిన్నారే అన్ని చెప్పేసింది.
మహారాష్ట్రలోని థానే జిల్లా భాయిదర్ పట్టణంలోని ఓ పాఠశాలలో తొమ్మిదేళ్ల చిన్నారిపై పలుమార్లు అత్యాచారం చేసిన ముగ్గురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది నుంచి విద్యార్థినిపై తరచూ లైంగిక దాడికి చేస్తున్న సంజయ్ పాటిల్ (47), నీలేశ్ భోయిర్ (47), జితేంద్ర జాద్ (23) అనే ముగ్గురు టీచర్లపై ఐపీసీ 376, 323, 504, 506 సెక్షన్లతోపాటు పోస్కో చట్టంలోని 2, 3 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.