కరెంటు షాక్ తో ముగ్గురు రైతుల మృతి
గట్టు: గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు రైతులు మృతి చెందారు. ఈ సంఘటన జిల్లాలోని గట్టు మండలం ఆలూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామంలోని వ్యవసాయ పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ను పక్కకు తొలగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో.. ముగ్గురు రైతులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.