టెరస్‌పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య


సాక్షి, ముంబై: పశ్చిమ ములుండ్‌లో గుర్తు తెలియని 16 యేళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి సెంట్రల్ ముంబైలోని ములుండ్ ప్రాంతంలో ఉన్న 11 అంతస్తుల మహవీర్ టవర్ కాంపౌండ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి... స్థానిక జయభారత్ హైస్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో  సిమ్రాన్ కేనీ(16) టెన్త్ చదువుతోంది. ఆమెను రెండేళ్లుగా సోహైల్ షేక్(18) ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేక శనివారం రాత్రి సిమ్రాన్ భవనం టెరస్‌పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.



మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న ములుండ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా, మృతురాలి చేతిపై ‘ఐ హేట్’ అని, దాని పక్కనే అసంపూర్ణంగా ఒక ఫోన్ నంబర్ రాసి ఉందని పోలీసులు తెలిపారు. విచారణలో ఆ నంబర్ సోహైల్‌దిగా గుర్తించామన్నారు. సోహైల్‌తో పాటు అతడికి సహాయం చేస్తున్న కమలేష్ వైష్ణవ్(19) అనే వ్యక్తితోపాటు సిమ్రాన్ క్లాస్‌మేట్ అయిన మరో మైనర్ బాలికను సైతం అరెస్టు చేశామని ములుండ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ రాజారాం వాన్‌మానే తెలిపారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top