ఎయిర్‌పోర్టుల్లో తెలుగు అనౌన్స్‌మెంట్లు

ఎయిర్‌పోర్టుల్లో తెలుగు అనౌన్స్‌మెంట్లు - Sakshi

అమరావతి: ఏపీలోని అన్ని విమానాశ్రయాల్లో ఇకపై తెలుగులో అనౌన్స్‌మెంట్లు వినపడనున్నాయి. తెలుగులో అనౌన్స్‌మెంట్స్‌ ఇచ్చేందుకు కేంద్ర విమానయాన శాఖ అంగీకారం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16 న శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్‌ రాసిన లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక రాష్ట్రంలోని కడప, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో.. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగులో కూడా ప్రకటనలు వినిపించనున్నాయి.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top