‘కేసీఆర్‌ చౌకబారు విమర్శలు మానుకో’

‘కేసీఆర్‌ చౌకబారు విమర్శలు మానుకో’ - Sakshi

ఖమ్మం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర బుధవారం ఉదయం ఖమ్మం నగరానికి చేరుకుంది.  పార్టీ శ్రేణులు ఆయన బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలపై కేసీఆర్‌ చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయే వారికి పూర్తి స్థాయి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలపై పోరాడటంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందని విమర్శించారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top