భువనగిరిలో నిలిచిపోయిన రైళ్లు
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి వద్ద ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ముంబయి ఎల్టీటీ రైలు నిలిచిపోయింది. దీంతో భువనగిరి రైల్వే స్టేషన్లో పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. రాజధాని, గోల్కొండ సహా మరో రైలు నిలిచిపోయింది. రెండు గంటలుగా రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రైలులో సాంకేతిక లోపాన్ని అరగంటలో సరిదిద్దుతామని సీపీఆర్వో ఉమాశంకర్ తెలిపారు. ఆ వెంటనే రైళ్ల రాకపోకలు పునరుద్ధరిస్తామన్నారు.