ఏపీ రాజధానిలో టీడీపీ ధర్నా
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనమాక గ్రామంలో రాజధాని రహదారిలో టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. తవ్వేసిన రోడ్లను వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఆర్డీఓ వచ్చేంతవరకు రోడ్డుపై నుంచి కదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈ ధర్నాలో పెనమాక గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అంతా పాల్గొంది. సాక్షాత్తూ అధికారపార్టీ కార్యకర్తలు, నాయకులే రోడ్ల పరిస్థితిపై ధర్నా దిగుతుండటంతో అధికారులకు ఏంచేయాలో పాలుపోవడం లేదు.