రాష్ట్రంలో క్రూరమైన పాలన: తమ్మినేని
అశ్వారావుపేట: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో క్రూరమైన పాలన సాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆయన చేపట్టిన మహాజన పాదయాత్ర మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండకు చేరింది. తమ్మినేని మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించడం శోచనీయమన్నారు.
రాష్ట్రంలో జనం కోసం పాలన సాగడం లేదని, కేవలం కుటుంబం, కాంట్రాక్టర్లకే ప్రజాధనం కట్టబెడుతున్నారని విమర్శించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్లో మార్చి 19న బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.