మారని పేదల బతుకులు: తమ్మినేని
ఇల్లెందు: సీఎం కేసీఆర్ పాలనలో పేదల బతుకులు మారే పరిస్థితి లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మహాజన పాదయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు శుక్రవారం చేరుకుంది.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్కు కుర్చీ మీద మమకారం ఉందని, అదే గద్దెను ఎక్కేందుకు కారకులైన ప్రజలపై ఏమాత్రం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, చేతివృత్తుల వారికి తీరని అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.