జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలి

జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలి - Sakshi


మహాజన పాదయాత్రలో తమ్మినేని



భద్రాచలం టౌన్‌: కులాలు, మతాలు, వర్గాల ప్రాతిపదికన కాకుండా జనాభా ప్రాతిపదికన తెలంగాణలో సామాజిక న్యాయం అందజేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ఆయన చేపట్టిన పాదయాత్ర ఆదివారం భద్రాచలం చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ  సీఎం కేసీఆర్‌ గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి అడవులనుంచి వారిని దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.



సభలో సీపీఎం నాయకులతో పాటు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు వెంకటరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు దామర్ల రేవతి, ఇతర పార్టీలు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లా దుమ్ముగుడెం వద్ద గోదావరికి లిఫ్ట్‌ ఏర్పాటుచేసి అక్కడి భూములకు నీరివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆదివారం లేఖ రాశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top