10 నెలల శిశువుకు స్వైన్ఫ్లూ
హైదరాబాద్: నగరంలో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. తాజాగా బీబీనగర్కు చెందిన పది నెలల మగ శిశువుకు స్వైన్ఫ్లూ సోకింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హీలింగ్ టచ్ ఆస్పత్రి నుంచి ఈ నెల 20 న శిశువును గాంధీలో చేర్చారు. మరో ఐదుగురు చిన్నారులకు స్వైన్ఫ్లూ లక్షణాలున్నాట్లు అనుమానిస్తున్నారు. గాంధీలో చికిత్సలు చేస్తున్నారు.
స్వైన్ఫ్లూతో భయం లేదు: గాంధీ సూపరింటెండెంట్
స్వైన్ఫ్లూతో ఎలాంటి భయం లేదని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ముగ్గురు వ్యక్తులు స్వైన్ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరారని వివరించారు. వారికి స్వైన్ఫ్లూ ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. గతేడాది జనవరిలో ముగ్గురు మృతి చెందారని, ఈ నెలలో స్వైన్ఫ్లూతో నలుగురు మృతి చెందారని ఆయన తెలిపారు.