శ్రీకాళహస్తిలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఎస్వీ డిగ్రీ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. డిగ్రీ విద్యార్థి తిరుమల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రిన్సిపాల్ సరస్వతి వేధింపులే కారణమని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధిత విద్యార్థిని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.