ప్రశ్నాపత్రం లీకుపై మంత్రి సీరియస్‌


- విచారణకు ఆదేశం

 

విజయవాడ: నెల్లూరు జిల్లాలో పదోతరగతి సైన్స్‌-1 పరీక్ష ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైన ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌ అయిందనే వార్త హల్‌చల్‌ చేస్తోంది. సామన్య శాస్త్రం-1 ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top