అతిలోక సుందరికి ఐదుకోట్లు
ఆల్ ఇండియా నటిగా పేరుగాంచిన నటి శ్రీదేవి. ఈమె సుమారు రెండు దశాబ్దాల క్రితం నుంచే అతిలోకసుందరిగా ప్రకాశిస్తున్నారు. వివాహానంతరం నటనకు దూరమైన ఈమె ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యి కూడా నేటికీ చిత్ర పరిశ్రమలో తన ఇమేజ్ను పెంచుకుంటున్నారు. అందుకు ఒకే ఉదాహరణ ఒక తమిళ చిత్రానికి శ్రీదేవి తీసుకుంటున్న పారితోషికమే. ప్రస్తుతం టాప్ హీరోయిన్లు కోటి, కోటిన్నర డిమాండ్ చేస్తున్నారని వింటున్నాం. అలాంటిది శ్రీదేవికి ఏకంగా ఐదుకోట్లు పారితోషికం చెల్లిస్తున్నట్లు సమాచారం. విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం గరుడ.
శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోషల్ మైథాలాజికల్ ఇతివృత్తంతో తెరకెక్కుతోంది. ఇందులో హన్సిక, శ్రుతిహాసన్లు నాయికా నాయికలుగా నటిస్తున్నారు. ఒక ముఖ్యపాత్రలో శ్రీదేవి మహారాణిగా నటిస్తున్నారు. శ్రుతిహాసన్ కోటి రూపాయలు, హన్సిక కోటిన్నర పారితోషికం తీసుకుంటుండగా శ్రీదేవికి మాత్రం ఐదు కోట్లు పారితోషికం అందిస్తున్నట్లు సమాచారం. వీరి పారితోషికాల లిస్టు చూసి భ్రమించిపోయిన ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న కన్నడ సూపర్స్టార్ సుదీప్ తనకు కోటికి పైగా పారితోషికం కావాలని డిమాండ్ చేస్తున్నారట.