సోమిరెడ్డి విదేశీ ఆస్తులపై దర్యాప్తు చేయాలి
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి
ముత్తుకూరు (సర్వేపల్లి): టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విదేశీ ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో దర్యాప్తు జరిపించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడుతూ అధికారంలో ఉన్నాం కదా అని తనపై అక్రమంగా పోలీసు కేసులు పెట్టించారని అన్నారు. ఈ వ్యవహారం కోర్టు విచారణలో ఉన్నందున ఈ అంశంపై ఎక్కువ మాట్లాడకూడదని పేర్కొన్నారు.