రేప్కేసు నుంచి బయట పడ్డ మాజీ మంత్రి
సాక్షి, శివమొగ్గ: స్నేహితుడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారన్న కేసులో కర్ణాటక మాజీ మంత్రి హరతాళు హాలప్పపై శివమొగ్గ కోర్టు తీర్పు వెలువరించింది. కేవలం రాజకీయ దురుద్ధేశంతోనే హాలప్పపై కేసు పెట్టారని, ఆయనను నిర్తోషిగా ప్రకటిస్తూ సిటీ రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా హాలప్ప మాట్లాడుతూ తనపై రాజకీయ దురుద్ధేశంతోనే కేసు పెట్టారని, తనకు న్యాయస్థానాలపట్ల గౌరవం ఉందని, అందుకే దీనిపై ఏడేళ్లుగా పోరాడుతున్నానని, చివరకు నిజమే గెలిచిందన్నారు. తను ఇష్టదైవం సింగదురేశ్వరీ దేవీ ఆలయంలో పూజలు చేశానని ఆతల్లి తనను కరుణించిందన్నాడు. త్వరలోనే మరోసారి అమ్మవారిని, ధర్మస్థలను దర్శించుకుంటానని హాలప్ప తెలిపారు.
యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీజీపీ ప్రభుత్వంలో హాలప్ప ఆహార శాఖా మంత్రిగా పనిచేశారు. 2009 నవంబర్ 36న శివమొగ్గలోని తన స్నేహితుడు వెంకటేశమూర్తి ఇంట్లో ఒకరోజు బస చేశారు. ఆసమయంలో మూర్తి భార్యపై హాలప్ప అత్యాచారానికి పాల్పడ్డారని కేసు నమోదైన విషయం తెలిసిందే.