నిలిచిన సికింద్రాబాద్-గుంటూరు రైలు
మహబూబాబాద్: సికింద్రాబాద్-గుంటూరు మధ్య ప్రయాణిస్తున్నఇంటర్సిటీ రైలును శనివారం మధ్యాహ్నం కె.సముద్రం రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. సిగ్నల్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా రైలును ఆపినట్టు అధికారులు తెలిపారు. సాంకేతిక లోపాన్ని సరిచేసిన తర్వాత రైలు బయలుదేరుతుందని చెప్పారు. రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.