సర్పంచ్, ఇద్దరు కార్యదర్శుల సస్పెన్షన్
మేడ్చల్: అక్రమ నిర్మాణాలు, అక్రమ వెంచర్లను ప్రోత్సహిస్తున్న ఓ సర్పంచ్ను, ఇద్దరు కార్యదర్శులను మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి సస్పెండ్ చేశారు. నారపల్లి, కొర్రెములలో అక్రమ నిర్మాణాలను, అక్రమ వెంచర్లను ప్రోత్సహిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని వీరిపై ఆరోపణలున్నాయి. దీంతో నారపల్లి సర్పంచ్ మల్లేష్ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇద్దరు కార్యదర్శులు జ్యోతి, రాజ్యలక్ష్మిలను కూడా కలెక్టర్ సస్పెండ్ చేశారు.