ఇసుక క్వారీ వద్ద కూలీల ఆందోళన
విజయవాడ: విజయవాడలోని లింగాయపాలెం ఇసుక క్వారీ వద్ద శనివారం కూలీలు ఆందోళనకు దిగారు. భారీ యంత్రాలకు బదులు తమకు ఇసుక తవ్వకం జరిపేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కూలీలు ఆందోళనకు దిగారు. యంత్రాల స్థానంలో తమను తీసుకోవాలని కోరారు.
ఈ నేపథ్యంలో కూలీల డిమాండ్ను ఇసుక సిండికేట్ నిర్వాహకులు అంగీకరించలేదు. ఇసుక తవ్వకానికి కూలీలను తీసుకోనేది లేదని స్పష్టం చేయడంతో కూలీలు, సిండికేట్ నిర్వాహకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్టు సమాచారం.