మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌లో మరో దారుణం


మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో మరో దారుణం వెలుగుచూసింది. బస్సు కోసం నిరీక్షిస్తున్న వ్యక్తి పైకి బస్సు దూసుకెళ్లి.. అతను మృతిచెందిన ఘటన మరవకముందే.. శనివారం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ రోజు మహబూబ్‌నగర్‌ బస్టాండ్లో బస్సు కోసం వేచి చూస్తున్న ఓ ప్రయాణికుడిపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అతని రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top