షిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ దోపిడీ


సాయినగర్ : సాయినగర్ షిర్డీ-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఎస్1, ఎస్2, ఎస్3, ఎస్5 బోగీల్లోని ప్రయాణికుల నుంచి దుండగులు బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. దుండగుల బీభత్సంతో ప్రయాణికులు గొలుసు లాగి రైలును నిలిపివేశారు. మహారాష్ట్రలోని పర్చూరు సమీపంలో అర్దరాత్రి ఈ ఘటన జరిగింది. బాధితులు పూర్ణ జంక్షన్ స్టేషన్‌లో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైలులో భద్రతా సిబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేశారు.



 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top