సాలూరులో రైస్ పుల్లింగ్ ముఠా అరెస్టు
విజయనగరం : విజయనగరం జిల్లా సాలూరులో అనుమానాస్పదంగా తిరుగుతున్న 11 మంది ముఠాను పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మాగ్నెట్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిని రైస్ పుల్లింగ్ గ్యాంగ్గా అనుమానిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వీరి వద్ద నుంచి ఒడిశాకు చెందిన రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.